కడప : చిత్తూరు జిల్లా శేషాచల కొండల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారులపై దాడి చేసిన నేపథ్యంలో వారి ఆట కట్టించేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా రంగంలోకి దిగారు. అందులోభాగంగా రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో పలు చెక్‑పోస్ట్‑లు, జాతీయ రహదారులపై ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తు, దాడులు చేస్తున్నారు. అందులోభాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట సమీపంలో అక్రమంగా రెండు వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు.
22, డిసెంబర్ 2013, ఆదివారండిసెంబర్ 22, 2013
రూ.కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత
By Fun Counter
22, డిసెంబర్ 2013, ఆదివారం