విశాఖపట్నం, డిసెంబర్ 24 : రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ, తెలంగాణలలో పొడి వాతావరణం నెలకొంది. కోస్తాలో అక్కడక్కడ పాక్షికంగా మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఇదే సమయంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. మధ్య భారతం మీదుగా గాలుల తీవ్రత తగ్గింది. దీంతో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం లేదా ఒకటిరెండు డిగ్రీలు అటుఇటూగా నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో స్వల్పంగా చలి పెరిగే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు.