Recent Posts

గెలిచిన వేళనే చూడాలీ

23, అక్టోబర్ 2009, శుక్రవారం
 గెలిచిన వేళనే చూడాలీ ..నాయకుని ముఖమున వెలుగూ.....
 
ఆహా ఇంద్రప్రస్థ పురము న...10, జనపధ మార్గము ..ఇట్లు వెలిగిపోవుచున్నదేమి..ఆహా దీపావళి పండుగ మరలా వచ్చినదా ఏమి..అని ఆకాశమునుంచీ దేవతలు ఆశ్చర్యమున చూచుచున్నారు.

నాలుగు దినముల క్రితము ఐపోయిన పండుగ వాతావరణం మళ్ళీ ..డిల్లీలో కనిపించింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి..కాంగిరెస్సు వారు ఆనందోత్సాహాలతో సోనియా మాత గుడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నారు. మాత దర్శనం కోసం క్యూ కాంప్లెక్సు లో వైటింగు చేస్తున్నారు.

ఇటు ..జగన్ కూడా 'ఆ ' పని మీద అమ్మగా(వా)రి దర్శనం కోసం వెళ్ళాడు. జ్యోతి దర్శనం కోసం బయలుదేరినట్టు..అందరు...తలో మార్గం లో ప్రయాణిస్తున్నారు. ఐతే ప్రసాదం ఎవరికి దక్కుతుందో ..అక్షింతలు ఎవరకి పడతాయో..చూడాలి మరి.

ఇన్నాళ్ళు 'జగనంత కుటుంబం మాదీ' ..అన్న వాళ్ళు కాస్తా..ఇప్పుడు.  రోషాలకు..పాశాలకు పోకుండా ..రోశయ్య గారు చెప్పినట్ట్లు నడుచుకుంటున్నారు..సంతకాలు ఎందుకు పెట్టామో కూడా తెలీదు అని చెప్పారు కొందరు మహానుభావులు..అంతే లే ఇవి 'మామూలే '

జిల్లాకి పేరుపెట్టి...రాష్ట్రం సంగతి నే చూసుకుంటాలే అని చెప్పకనే చెప్పారు..ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు..ఆలస్యం అమృతం విషం అని ముందే కూసిన కోయిలలు..గవర్నమెంటు పనులలో నిదానమే ప్రధానం అన్న సూక్తి మాత్రమే వర్కౌట్ అవుతుందని తెలిసేలోగా...జరగాల్సినవి జరిగిపోతున్నాయి..బీ బ్లాకునుంచీ సీ బ్లాకుకి..

నేను నిమిత్త మాత్రుణ్ణి..దేవత ఏమి చెబితే అది చేస్తాను ..అని రోశయ్య గారి ఉవాచ..ఎలాగూ. ఓ నాలుగైదేళ్ళు తపస్సు చేస్తే గానీ.దేవత ప్రత్యక్ష్యమై.వరాలివ్వదని ఆయనకీ తెలుసు..దాదాపు 50 ఏళ్ళుగా తపస్సుచేస్తున్న అనుభవం ఆయనది..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

వినోదం - తాజా - Google వార్తలు